రామ్ చరణ్ కొత్త సినిమా ప్రారంభం
ప్రముఖ దర్శకుడు శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో కొత్త సినిమా బుధవారం నాడు హైదరాబాద్ లో అట్టహాసంగా ప్రారంభం అయింది. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా కియారా అద్వాని నటిస్తోంది. ఈ షూటింగ్ ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హైదరాబాద్లో బుధవారం ఉదయం పూజా కార్యక్రమంతో సినిమాను లాంఛనంగా ప్రారంభించారు.
రామ్చరణ్ 15వ చిత్రంగా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. శిరీష్ దీనికి సహ నిర్మాత.అంజలి, సునీల్, జయరామ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సినిమా ప్రారంభోత్సవానికి దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చిరంజీవి ముహుర్తపు షాట్ కు సంబంధించి క్లాప్ కొట్టారు.