Telugu Gateway
Cinema

గేమ్ ఛేంజర్ తేదీ మార్చారు

గేమ్ ఛేంజర్ తేదీ మార్చారు
X

ప్రచారమే నిజం అయింది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా విడుదల వాయిదా పడింది. గత కొన్నిరోజులుగా డిసెంబర్ లో క్రిస్మస్ కు సినిమా పక్కా అంటూ చిత్ర యూనిట్ అనధికారిక లీక్ లు ఇచ్చుకుంటూ వచ్చింది. కానీ నిర్మాత దిల్ రాజు దసరా పండగ రోజు అసలు విషయం చెప్పేశారు. అదేంటి అంటే గేమ్ ఛేంజర్ సినిమా క్రిస్మస్ కు కాకుండా..సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. వివిధ వర్గాల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాత దీనిపై తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. గేమ్ ఛేంజర్ కోసం చిరంజీవి విశ్వంభర సినిమా విడుదల కొత్త తేదీ కి మారనుంది. ఈ సినిమాను తొలుత జనవరి 10 న విడుదల చేయబోతున్నట్లు ఎప్పుడో ప్రకటించిన విషయం తెలిసిందే.

రామ్ చరణ్ సినిమా కోసం ఈ సినిమా తేదీ విడుదల మార్చుకోవటానికి అటు చిరంజీవి తో పాటు నిర్మాతలు కూడా అంగీకరించారు అని దిల్ రాజు తెలిపారు. అయితే మరి విశ్వంభర సినిమా ముందే విడుదల అవుతుందా లేక...సంక్రాంతి తర్వాత విడుదల చేస్తారా అన్నది వేచిచూడాలి. దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారతీయుడు 2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణ పరాజయాన్ని చూడటం తో పాటు గత కొంత కాలంగా గేమ్ ఛేంజర్ చుట్టూ నెగిటివ్ వైబ్స్ సాగుతున్నాయని ప్రచారం టాలీవుడ్ లో ఉంది. ఇప్పుడు మరో సారి అనుకున్న సమయానికి కాకుండా ఈ సినిమా విడుదల వాయిదా పడటం సినిమా కు ఏ మాత్రం మేలు చేసే అంశం కాదు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ కు జోడి గా కియారా అద్వానీ, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే.

Next Story
Share it