Telugu Gateway
Cinema

ఆట మొదలుపెట్టేసినట్లేనా!

ఆట మొదలుపెట్టేసినట్లేనా!
X

సంచలన దర్శకుడు శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ వేగం పెంచుతున్నట్లు కనిపిస్తోంది. ఎప్పటి నుంచో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ సినిమా విడుదల తేదీతో పాటు అప్ డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో చిత్ర యూనిట్ సెకండ్ సింగిల్ ప్రోమో ను సెప్టెంబర్ 28 న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పాన్ ఇండియా సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి.

అయితే శంకర్ భారతీయుడు 2 బాక్స్ ఆఫీస్ వద్ద దారుణ ఫలితాన్ని చవిచూడటంతో ఈ ప్రభావం ఏమైనా గేమ్ ఛేంజర్ పై పడుతుందా అన్న టెన్షన్ చిత్ర యూనిట్ లో ఉంది. గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ కు జోడిగా కియారా అద్వాని నటిస్తోంది. అంజలి కూడా కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాను డిసెంబర్ 20 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అధికారికంగా తేదీ చెప్పకపోయినా..ఈ ఏడాది చివరిలో గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story
Share it