Telugu Gateway
Cinema

'పుష్ప‌' ట్రైల‌ర్ మేనియా..15 మిలియ‌న్ల వ్యూస్

పుష్ప‌  ట్రైల‌ర్ మేనియా..15 మిలియ‌న్ల వ్యూస్
X

'పుష్ప‌' అంటే పువ్వు కాదు..ఫైర్ అంటూ అల్లు అర్జున్ ట్రైల‌ర్ లో తానేంటో చెప్పాడు. సోమ‌వారం రాత్రి విడుద‌లైన పుష్ప ట్రైల‌ర్ దుమ్మురేపుతోంది. నాలుగు భాష‌ల్లో క‌లుపుకుని ఈ ట్రైల‌ర్ ను ఏకంగా 1.5 కోట్ల మంది (15 మిలియ‌న్లు) వీక్షించార‌ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీమూవీమేక‌ర్స్ అధికారికంగా వెల్ల‌డించింది. అంత‌టా పుష్ప ట్రైల‌ర్ మేనియా కొన‌సాగుతోంద‌ని పేర్కొంది. వాస్త‌వానికి ఈ ట్రైల‌ర్ సోమ‌వారం సాయంత్రం ఆరు గంట‌ల మూడు నిమిషాల‌కు విడుద‌ల కావాల్సి ఉండ‌గా..సాంకేతిక కార‌ణాల‌తో జాప్యం జ‌రిగింది. దీని కోసం అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ట్రైల‌ర్ లో అల్లు అర్జున్ డైలాగ్ లు హైలెట్ గా నిలిచాయి.

పోలీసుల‌తో అల్లు అర్జున్ 'ఈలోకం మీకు తుపాకులు ఇచ్చింది. మాకు గొడ్డ‌లి ఇచ్చింది. ఎవ‌రి యుద్దం వాడిదే' అంటూ చెప్పే డైలాగ్ కూడా ఆక‌ట్టుకునేలా ఉంది. అల్లు అర్జున్ శేషాచ‌లం అడ‌వుల్లో ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ డాన్ గా క‌న్పించ‌బోతున్నారు. ఇదిలా ఉంటే ర‌ష్మిక మంద‌న‌, అల్లు అర్జున్ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు, డైలాగ్ లు చూసిన వారెవ‌రైనా న‌వ్వుకోవాల్సిందే. శ్రీవ‌ల్లి పాత్ర‌లో ర‌ష్మిక అత్యంత స‌హ‌జంగా క‌న్పించింది. పుష్ప సినిమా తెలుగుతోపాటు త‌మిళం, మ‌ళ‌యాళం, క‌న్న‌డ‌ల్లో కూడా విడుద‌ల కానుంది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మూవీ తొలి భాగం డిసెంబ‌ర్ 17న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

Next Story
Share it