Telugu Gateway
Cinema

మూడు రోజులు...173 కోట్లు

మూడు రోజులు...173 కోట్లు
X

అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న‌ల సినిమా పుష్ప బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా మూడు రోజుల్లో 173 కోట్ల రూపాయ‌ల గ్రాస్ సాధించిన‌ట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. 2021లో ఇదే భార‌త అతిపెద్ద గ్రాస్ వ‌సూళ్లు అని మైత్రీ మూవీ మేక‌ర్స్ పేర్కొంది. ఈ వ‌సూళ్ల‌కు సంబంధించి చిత్ర యూనిట్ ప్ర‌తి రోజూ అప్ డేట్స్ ఇస్తోంది. ఆదివారం నాడు తెలుగు రాష్ట్రాల‌తోపాటు ఇత‌ర ప్రాంతాల్లో కూడా మంచి వ‌సూళ్ల‌ను సాధించింది ఈ సినిమా.

సుకుమార్ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కిన ఈ మూవీ రిలీజ్ దగ్గ‌ర నుంచి మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. సెకండాఫ్ విష‌యంలో కొంత భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అయినా..ఓవ‌రాల్ గా సినిమాలో అల్లు అర్జున్ న‌ట‌న‌కు అంద‌రూ సూప‌ర్ అంటున్నారు. సినిమా క‌లెక్షన్లు కూడా ఇదే విష‌యాన్ని నిరూపిస్తున్నాయి.

Next Story
Share it