Telugu Gateway
Cinema

ప్ర‌భాస్ 'ఆదిపురుష్‌' షూటింగ్ పూర్తి

ప్ర‌భాస్ ఆదిపురుష్‌  షూటింగ్ పూర్తి
X

ప్ర‌భాస్ పై ఆయ‌న ఫ్యాన్స్ కు ఏమైనా అసంతృప్తి ఉంటుంది అంటే అది ఆయ‌న సినిమా..సినిమాకు మ‌ధ్య ఎక్కువ గ్యాప్ ఉండ‌ట‌మే. ఇటీవల కాలంలో ఆయ‌న చేసేవీ అన్నీ పాన్ ఇండియా సినిమాలు కావ‌టం..స‌హ‌జంగానే అవి ఎక్కువ స‌మ‌యం తీసుకోవ‌టం జ‌రుగుతూ ఉంటుంది. దీంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఒకింత అసంతృప్తి చెందుతుంటారు. ఆయ‌న సినిమాల కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటిది ఈ సారి ప్ర‌భాస్ ఓ సినిమా విష‌యంలో సంచ‌ల‌నం న‌మోదు చేశారు. కేవ‌లం 103 రోజుల్లో ప్ర‌భాస్ ఆదిపురుష్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసేశారు. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్ల‌డించింది. 'ఆదిపురుష్ సినిమాను ప్ర‌ముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. భారీ బడ్జెట్‌తో 3డీ చిత్రంగా ఆది పురుష్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్ర పోషిస్తుండగా.. కృతిసనన్ సీతగా కనిపించనుంది. లంకేశుడు రావణుడి పాత్రను సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడి పాత్రను సన్నీ సింగ్ పోషించారు. ఆదిపురుష్‌ సినిమా షూటింగ్‌ ప్రారంభమై మూడు నెలలపైనే అవుతుంది.

అయితే పాన్‌ ఇండియా చిత్రం కావడంతో షూటింగ్‌ పూర్తవడానికి ఏళ్లు పడుతుందని అందరూ భావించారు. కానీ ఆశ్చర్యంగా 103 రోజుల్లో ఆది పురుష్‌ షూటింగ్‌ పూర్తయింది. ఈ విషయాన్ని తాజాగా డైరెక్టర్‌ ఓంరౌత్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ఓ అద్భుతమైన ప్రయాణం గమ్యస్థానానికి చేరుకుంది. మేము క్రియేట్‌ చేసిన మ్యాజిక్‌ను మీతో పంచుకోవడం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను' అంటూ ట్వీట్‌ చేశారు. ఈ సినిమాను భూషణ్‌కుమార్‌, క్రిషన్‌కుమార్‌, ఓంరౌత్‌, ప్రసాద్ సుతార్‌, రాజేశ్‌ నాయర్‌ నిర్మాతలుగా వ్యవహరించారు. వచ్చే ఏడాది ఆగస్టు 11 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని ఇప్పటికే చిత్ర యూనిట్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

Next Story
Share it