Telugu Gateway
Cinema

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కీలక పాత్రల్లో !

పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కీలక పాత్రల్లో !
X

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా మొదలైంది. తొలి సారి తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి సినిమా చేస్తున్నారు. దీంతో పవన్ చేతిలో సినిమాల సంఖ్య అలా పెరుగుతూ పోతుంది. ఇప్పటికే 'హరిహర వీరమల్లు' సినిమా తుది దశలో ఉంది. కొత్త ఏడాది జనవరి లోనే సుజీత్ డైరక్షన్ లో ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ (ఓ జీ) సినిమా స్టార్ట్ చేసిన విషయం తెలిసింది. దీంతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా క్యూ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ను హరీష్ శంకర్ తెరకెక్కించనున్నారు. ఇప్పుడు కొత్తగా బుధవారం నాడు ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్ర ఖని సినిమా స్టార్ట్ అయింది. సముద్ర ఖని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఇది తమిళ సినిమా 'వినోదయ సితం' (#VinodhayaSitham) కి రీమేక్. ఈ కొత్త సినిమా కార్యక్రమం లో నిర్మాత విశ్వప్రసాద్ తో పాటు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, థమన్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్లు గా కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ లు నటించే అవకాశం ఉంది అని టాక్. అయితే ఒక వైపు ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన పవన్ కళ్యాణ్ ఎప్పటిలోగా ఈ సినిమాలు పూర్తి చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.

Next Story
Share it