Telugu Gateway
Cinema

ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలో నిత్య‌మీన‌న్

ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలో నిత్య‌మీన‌న్
X

సంక్రాంతి సంద‌డి పెరుగుతోంది. ఇప్ప‌టికే ప్ర‌భాస్ హీరోగా న‌టించిన రాధే శ్యామ్ సినిమాను జ‌న‌వ‌రి 14న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా కూడా సంక్రాంతి బ‌రిలో నిల‌వ‌నుంద‌ని తేల్చారు. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ అధికారికంగానే ప్ర‌క‌టించింది. పవన్‌కల్యాణ్‌, రానా ప్రధాన పాత్రల్లో 'అయ్యప్పన‌మ్ కోషియుమ్‌' రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలు త్రివిక్రమ్ అందిస్తుండగా, సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప‌వ‌న్ కు జోడీగా నిత్య మీన‌న్ ను ఎంపిక చేశారు.

ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్ల‌డించింది. ఈ మేర‌కు ఓ ఫోటోను విడుద‌ల చేసింది. ఇందులో నిత్యామీనన్‌ చీరకట్టు, మంగళసూత్రంతో కనిపించడంతో ఆమె పవన్‌కు భార్యగా నటించనున్నట్లు స‌మాచారం. పవన్‌కల్యాణ్‌ ఈ సినిమాలో భీమ్లా నాయక్‌గా కనిపించనున్నారు. మరోవైపు రానాకు జోడీగా ఐశ్వర్య రాజేశ్‌ నటించనుందని, త్వరలోనే ఆమె షూటింగ్‌లో పాల్గొననున్నట్లు చెబుతున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు .

Next Story
Share it