Telugu Gateway
Cinema

ఆస్కార్ తో పెరగనున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ బ్రాండ్ వేల్యూ!

ఆస్కార్ తో పెరగనున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ బ్రాండ్ వేల్యూ!
X

టాలీవుడ్ లో ఇప్పటికే అటు ఎన్టీఆర్, ఇటు రాంచరణ్ లు అగ్ర హీరోలుగా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా లో వీళ్ళిద్దరూ దుమ్మురేపి డాన్స్ చేసిన నాటు నాటు పాటకు ప్రపంచంలోనే అత్యున్నతమైన ఆస్కార్ అవార్డు దక్కింది. ఈ పాటలో ఇద్దరు హీరో లు ఎన్ని టేక్ లు తీసుకున్నా కూడా సింక్ తో వేసిన స్టెప్స్ మాత్రమే దీన్ని ఆ రేంజ్ కు తీసుకెళ్లామని చెప్పొచ్చు. పాటలో ఉన్న నాటు తో పాటు మ్యూజిక్, డాన్స్ అన్ని కలిపి నాటు నాటు తో ఆస్కార్ కొట్టేలా చేశాయి. ఈ ఇద్దరు హీరో లు ఇంత కాలం ఆర్ఆర్ఆర్ సినిమా తో జాతీయ స్థాయిలోనే గుర్తింపు పొందారు. ఆస్కార్ అవార్డు తో వీళ్లకు అంతర్జాతీయ గుర్తింపు కూడా దక్కింది. దీంతో ఇప్పుడు ఈ ఇద్దరు హీరో ల బ్రాండ్ వేల్యూ మరింత పెరనుంది. ఇక నుంచి ఎన్టీఆర్, రామ్ చరణ్ వేసే ప్రతి అడుగు అత్యంత కీలకంగా మారనుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే తన 30 వ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.

రాంచరణ్ ప్రస్తుతం తన 15 వ సినిమా చేస్తున్నారు. ఒకరు ముప్పయ్యవ సినిమాకు, మరొకరు 15 వ సినిమాకే తాము కీలక భూమిక పోషించిన పాటకు ఆస్కార్ అవార్డు దక్కించుకోవటం మామూలు విషయం ఏమీ కాదు. ఇది అంతా దర్శకుడు రాజమౌళి కృషి అయినా ఈ ఇద్దరు హీరో లు డాన్స్ లో ఇరగదీస్తారు అనే విషయం తెలిసిందే. నాటు నటుడు పాటు ఆస్కార్ రావటం తో ఇద్దరు హీరో ల బ్రాండ్ వేల్యూ పెరగటం తో పాటు వాళ్ళిద్దరిపై ఒత్తిడి కూడా పెరిగే ప్రమాదం లేకపోలేదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అటు ఎన్టీఆర్, ఇటు రాంచరణ్ లు ఇప్పటికే ఇటు సినిమా ల తో పాటు పలు బ్రాండ్స్ కు అంబాసిడర్స్ గా కూడా వ్యవరిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది అని...భారీ మొత్తంలో చెల్లించి మరి వీళ్ళిద్దరితో ఒప్పందాలు చేసుకుంటారు అని చెపుతున్నారు.

Next Story
Share it