Telugu Gateway
Cinema

ఎన్టీఆర్, నాగార్జున చెరో 50 లక్షల విరాళం

ఎన్టీఆర్, నాగార్జున చెరో  50 లక్షల విరాళం
X

టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. వరదలతో నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు తన వంతు సాయంగా ఈ మొత్తం ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్టు చేశారు. హైదరాబాద్ ను తిరిగి గాడిన పెట్టేందుకు ప్రతి ఒక్కరూ నడుంబిగించాలని కోరారు.

అంతకు ముందు అక్కినేని నాగార్జున కూడా సీఎంఆర్ఎఫ్ కు 50 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం బాధితులను ఆదుకునేందుకు 550 కోట్ల రూపాయలు కేటాయించటంపై నాగార్జున హర్షం వ్యక్తం చేశారు.

Next Story
Share it