టాలీవుడ్ కు 'మేలుకోలుపు' ఆ మూడు సినిమాలు

కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన బింబిసార, దుల్కర్ సల్మార్ హీరోగా వచ్చిన సీతారామం, నిఖిల్ హీరోగా వచ్చిన కార్తికేయ2లు బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయలు కొల్లగొట్టాయి. ఈ సినిమాలు అన్నింటికి మల్లీప్లెక్స్ లో 200 రూపాయల ధర పెట్టినా ప్రేక్షకులు క్యూకట్టి మరీ సినిమాలు చూశారు. వాస్తవానికి ఈ హీరోల రేంజ్ కు..ఈ రేటు ఎక్కువే. అయినా సరే ప్రేక్షకులు డబ్బు విషయంలో ఏ మాత్రం వెనకాడకుండా థియేటర్లకు వచ్చారు. వీటి అన్నింటి కంటే ముఖ్యం సినిమాపై వచ్చే టాక్ కూడా అత్యంత కీలకంగా మారింది. ఇటీవల వచ్చిన ది వారియర్, థ్యాంక్యూ, మాచర్ల నియోజకవర్గం సినిమాలు దారుణ పరాభవాన్ని చవిచూసినట్లు పరిశ్రమ వర్గాల టాక్. అయితే ఖచ్చితంగా పరిశ్రమ సినిమా టిక్కెట్ రేట్ల విషయంలో పునరాలోచన చేయకుంటే మాత్రం రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.