Telugu Gateway
Cinema

మంచి క‌థ‌తో వ‌స్తే మ‌ల్టీస్టార‌ర్ కు రెడీ

మంచి క‌థ‌తో వ‌స్తే మ‌ల్టీస్టార‌ర్ కు రెడీ
X

అఖండ సినిమా స‌క్సెస్ తో నందమూరి బాలకృష్ణ ఫుల్ కుషీగా ఉన్నారు. చాలా మంది సినిమాల విడుద‌ల‌కు భ‌య‌ప‌డినా తాము ధైర్యం చేసి విడుద‌ల చేశామ‌ని..విజ‌యం సాధించామ‌న్నారు. అఖండ చిత్ర ద‌ర్శ‌కుడు, నిర్మాత‌తో క‌ల‌సి ఆయ‌న బుధ‌వారం నాడు విజ‌యవాడ‌లో క‌న‌క‌దుర్గ అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఎవ‌రైనా మంచి క‌థ‌తో వ‌స్తే మ‌ల్టీస్టార‌ర్ సినిమాకు రెడీ ఉన్నారు. కొద్ది రోజుల క్రితం కూడా బాలకృష్ణ ఓ షోలో మాట్లాడుతూ విల‌న్ పాత్ర‌ల‌కు సై అంటూ ప్ర‌క‌టించారు. ఆ వెంట‌నే అందులో హీరో కూడా తానే కావాల‌న్నారు. అఖండ సినిమా విజ‌యంతో అమ్మవారిని దర్శించుకోవ‌టానికి వ‌చ్చామ‌న్నారు.

నందమూరి తారక రామారావు ఆనాడు భక్తిని కాపాడితే..ఇప్పుడు సనాతన దర్మాన్ని కాపాడిన సినిమా అఖండ అని వ్యాఖ్యానించారు. ఏదైనా పని తలపెడితే విజయం తథ్యం అని అమ్మవారి అశీస్సులతో సినిమా దిగ్విజయంగా ప్రదర్శింపబడుతుందని తెలిపారు. మంచి సినిమాను ప్రజలు ఆదరిస్తారని మరోసారి నిరూపించారన్నారు. టిక్కెట్ల విధానంపై గతంలో చర్చించుకున్నాం..ఏదైతే అదని సినిమా విడుదల చేశామ‌ని తెలిపారు. అఖండ చిత్రం విజయం సినీ పరిశ్రమకు ఊపిరినిచ్చిందన్నారు. సినిమాను గెలిపించిన ప్రేక్షకుల‌కు ధ‌న్య‌వాదాలు అన్నారు ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను.

Next Story
Share it