Telugu Gateway
Cinema

స‌ర్కారు వారి సెట్ లో న‌మ్ర‌త‌

స‌ర్కారు వారి సెట్ లో  న‌మ్ర‌త‌
X

మ‌హేష్ బాబు, కీర్తిసురేష్ జంట‌గా న‌టిస్తున్న సినిమా స‌ర్కారు వారి పాట‌. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా పూర్తి చేసుకుంటోంది. ప్ర‌స్తుతం స్పెయిన్ లో షెడ్యూల్ న‌డుస్తోంది. పాట‌ల‌తోపాటు కీల‌క స‌న్నివేశాల‌ను షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నారు. ఇక్క‌డ మ‌హేష్ బాబు ఓ వైపు షూటింగ్ లో పాల్గొంటూనే..మ‌రో వైపు ఫ్యామిలీతో క‌ల‌సి ఎంజాయ్ చేస్తున్నాడు. స్పెయిన్ షూటింగ్ చివ‌రి రోజున సెట్స్‌లో మహేశ్‌ భార్య నమ్రత ఎంట్రీ ఇచ్చింది.

పాట షూట్‌ నేపథ్యంలో అక్కడికి వెళ్లిన ఆమె కీర్తి సురేశ్‌తో క‌ల‌సి క‌బుర్లు చెప్పుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది న‌మ్ర‌త‌. హైదరాబాద్ లో జరిగే షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్‌ పూర్తవుతుంద‌ని స‌మాచారం. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 13వ తేదీన విడుదల కానుంది. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

Next Story
Share it