Telugu Gateway
Cinema

కీర్తి సురేష్ 'మిస్ ఇండియా' ట్రైలర్ విడుదల

కీర్తి సురేష్ మిస్ ఇండియా ట్రైలర్ విడుదల
X

.కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించిన 'మిస్ ఇండియా' సినిమా విడుదల తేదీ ఖరారు అయింది. అది కూడా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో విడుదల కానుంది. దీనికి ముహుర్తంగా నవంబర్ 4ని నిర్ణయించారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ శనివారం నాడు విడుదల చేసింది. ఈ ట్రైలర్ లో కీర్తి సురేష్ నటన ఆకట్టుకుంటోంది. గత సినిమాలకు భిన్నంగా ఇందులో కీర్తి చాలా స్లిమ్ గా మారిపోయింది. చిన్నప్పుడే తన కల ఏంటో చెబుతుంది. ఎంబీఏ చేసి బిజినెస్ చేయాలన్నది కీర్తి సురేష్ కల.

కానీ ఆ కలను నెరవేర్చుకునేందుకు ఆమె పడ్డ ఇబ్బందులే సినిమా స్టోరీగా ట్రైలర్ లో చెప్పకనే చెప్పేశారు. ఈ సినిమాలో నవీన్ చంద్ర, జగపతిబాబు, నదియా, సురేష్ కీలకపాత్రలు పోషించారు. ట్రైలర్ లో కీర్తి సురేష్ డైలాగ్ లు ఆసక్తికరంగా ఉన్నాయి. మిస్ ఇండియా నేను కాదు..ఇది ఓ బ్రాండ్ అన్న డైలాగ్ హైలెట్ గా నిలిచింది. థియేటర్లకు పర్మిషన్ ఇచ్చినా ఇంత వరకూ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా అందుకు ఎవరూ సాహసించటం లేదు. ఈ తరుణంలో మిస్ ఇండియా సినిమాను కూడా చిత్ర యూనిట్ ఓటీటీ మార్గంలోనే విడుదల చేయాలని నిర్ణయించటం విశేషం.

Next Story
Share it