Telugu Gateway
Cinema

విదేశీ ప‌ర్య‌ట‌న‌కు చిరంజీవి

విదేశీ ప‌ర్య‌ట‌న‌కు చిరంజీవి
X

మెగాస్టార్ చిరంజీవి కుటుంబ స‌మేతంగా విదేశీ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరి వెళ్లారు. క‌రోనా వెలుగుచూసిన త‌ర్వాత ఇదే త‌న తొలి విదేశీ ప‌ర్య‌ట‌న అని చిరంజీవి పేర్కొన్నారు. అమెరికాతోపాటు యూర‌ప్ లో ప‌ర్య‌టించ‌నున్న‌ట్లు చెబుతూ ఇన్ స్టాగ్రామ్ లో ఈ ఫోటోను షేర్ చేశారు. హాలిడే కోసం వెళుతున్నాను..త్వ‌ర‌లో క‌లుద్దాం అంటూ పేర్కొన్నారు. చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ లు న‌టించిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29న విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్ర‌మ స్పంద‌న వ్య‌క్తం అయింది.

Next Story
Share it