వాట్సప్ అంకుల్స్..యూట్యూబ్ అంటీస్
కరోనా పోయి సాధారణ స్థితికి వస్తుందనే సందేశంతో ఈ సినిమా తెరకెక్కించినట్లు కన్పిస్తోంది. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్ సన్నవేశాల్లో మళ్ళీ లాక్ డౌన్ అదీ వస్తే ఇబ్బంది అంటూ హీరో చేసే చిలిపి పనులు కూడా ట్రైలర్ లో ఉన్నాయి. సంతోష్ శోభన్, మెహరీన్ జంటగా నటించిన చిత్రమే 'మంచి రోజులు వచ్చాయి'. నవంబర్ 4న సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ట్రైలర్ ద్వారా తెలిపింది. ఈ సినిమాలో వెన్నెల కిశోర్, సప్తగిరి, వైవా హర్ష, అశిష్ ఘోష్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఏక్ మినీకథ సినిమాతో సంతోష్ శోభన్ మంచి హిట్ అందుకున్నారు.