Telugu Gateway
Cinema

మే 27న 'మేజ‌ర్' విడుద‌ల‌

మే 27న మేజ‌ర్ విడుద‌ల‌
X

వాయిదా ప‌డిన సినిమాలు అన్నీ వ‌ర‌స పెడుతున్నాయి. దేశ వ్యాప్తంగా క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ఎవ‌రికి వారు త‌మ త‌మ సినిమాల‌ను ఎంత త్వ‌ర‌గా వీలైతే అంత త్వ‌ర‌గా విడుద‌ల చేసి ప‌ని పూర్తి చేసుకోవాల‌నుకుంటున్నారు. అడివి శేష్‌ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం మేజ‌ర్ విడుద‌ల తేదీని ప్ర‌కటించారు. ఈ సినిమా 26/11 ముంబ‌య్ ఉగ్ర దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మేజ‌ర్ సందీప్ ఉన్నిక్రిష్ణ‌న్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న విష‌యం తెలిసిందే. శశికిరణ్‌ తిక్క దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 27న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

తాజాగా ఈ చిత్రం రిలీజ్‌ డేట్‌ను లాక్‌ చేస్తూ స్పెషల్‌ గ్లింప్స్‌ వీడియోను హీరో అడివి శేష్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు.ఈ చిత్రంలో శోభితా ధూళిపాళ‌తోపాటు బాలీవుడ్ హీరోయిన్ స‌యీ మంజ్రేక‌ర్ మ‌రో ఫీ మేల్ లీడ్ రోల్‌లో న‌టిస్తోంది. మహేశ్‌బాబు జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్, సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. ప్రకాశ్‌ రాజ్, రేవతి, మురళీ శర్మ ఈ సినిమాలో కీల‌క పాత్రలు పోషించారు. గ‌తంలో ప‌లు విడుద‌ల తేదీలు ప్ర‌క‌టించినా అన్ని సినిమాల త‌ర‌హాలోనే ఇది కూడా వాయిదా ప‌డింది.

Next Story
Share it