Telugu Gateway
Cinema

'లైగ‌ర్' నుంచి కొత్త అప్ డేట్స్

లైగ‌ర్ నుంచి కొత్త అప్ డేట్స్
X

విజ‌య‌దేవ‌ర‌కొండ‌, అనన్య‌పాండే జంట‌గా న‌టిస్తున్న సినిమా 'లైగ‌ర్'. ఈ సినిమాలో మైక్ టైస‌న్ కూడా భాగ‌స్వామి కావ‌టం ఓ సంచ‌ల‌నం. ఈ ఏడాదిలోనే విడుద‌ల కావాల్సిన లైగ‌ర్ క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. ఇటీవ‌లే అమెరికాలో భారీ షెడ్యూల్ ను పూర్తి చేసుకుని వ‌చ్చిన విష‌యం తెలిసిందే. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు కరణ్‌ జోహార్, పూరి జగన్నాథ్, చార్మి, అపూర్వా మెహతా నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే.

తాజాగా చిత్ర యూనిట్ అభిమానుల‌కు కొత్త అప్ డేట్స్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 25న విడుదల చేస్తామని ప్రకటించారు. ఇక ఈ ఏడాది చివర్లో డిసెంబర్‌31రోజు లైగర్‌ గ్లింప్స్‌ను రిలీజ్‌ చేస్తామని ప్ర‌క‌టించారు. ఈ సినిమా తెలుగు, హిందీ, త‌మిళ్, మ‌ళ‌యాలం, క‌న్న‌డ భాష‌ల్లో విడుద‌ల కానుంది. బాక్సింగ్ నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్క‌నున్న విష‌యం తెలిసిందే.

Next Story
Share it