Telugu Gateway
Cinema

కృతిసనన్ కు కరోనా పాజిటివ్

కృతిసనన్ కు కరోనా పాజిటివ్
X

'నేనొక్కడినే' సినిమాలో మహేష్ బాబుతో జోడీకట్టిన బాలీవుడ్ భామ కృతిసనన్ కరోనా బారినపడ్డారు. మహేష్ తో సినిమా తర్వాత ఆమె తెలుగులో పెద్దగా కన్పించకపోయినా బాలీవుడ్ లో మాత్రం వరస సినమాలతో దూసుకెళుతోంది. తాను కరోనా బారిన పడిన విషయాన్ని ఈ నటి ధృవీకరించింది. అయితే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..తాను సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉన్నట్లు తెలిపింది.

డాక్టర్లు, బీఎంసీ సలహా మేరకు హోం క్వారంటైన్ లో ఉన్నట్లు వెల్లడించింది. ఈ అలను దాటుకుని త్వరలోనే బయటకు వచ్చి..పనిలో నిమగ్నం అవుతానని పేర్కొంది. ఇటీవలే కృతిసనన్ చండీఘర్ నుంచి ముంబయ్ కు తిరిగొచ్చింది.. అక్కడ ఆమె ఓ సినిమా షూటింగ్ లో పాల్గొంది.

Next Story
Share it