Telugu Gateway
Cinema

మూడు నెలల వరకు విశ్రాంతిలోనే!

మూడు నెలల వరకు విశ్రాంతిలోనే!
X

హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పిటల్ నుంచి ఎన్టీఆర్ గురువారం నాడు డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకు బుధవారం నాడు కిమ్స్ లో విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి అయింది. కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ భుజానికి గాయం అయిన సంగతి తెలిసిందే. తొలుత కొన్ని వారాలు విశ్రాంతి తీసుకుంటే ఇది సెట్ అవుతుంది అని భావించారు కానీ గాయాన్ని పరిశీలించిన డాక్టర్లు శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది అని తేల్చారు. దీంతో ఆయన వెంటనే కిమ్స్ లో చేరటం..నిపుణుల బృందంతో కూడా డాక్టర్లు ఆయనకు శస్త్రచికిత్స కూడా పూర్తి అయింది.

గురువారం నాడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతూ ఎన్టీఆర్ డాక్టర్స్ తో కలిసి దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ గాయం నుంచి కోలుకోవడానికి రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుంది అని ఇప్పటికే డాక్టర్లు వెల్లడించారు. తాను త్వరగా కోలుకోవాలని కోరుకున్న వాళ్లందరికీ ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఎన్టీఆర్ సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ మూవీ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాన్ ఇండియా మూవీ వచ్చే ఏడాది జూన్ 11 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story
Share it