Telugu Gateway
Cinema

ఐటి శాఖ అధికారుల కోసం ఎదురుచూశా

ఐటి శాఖ అధికారుల కోసం ఎదురుచూశా
X

హీరోయిన్ స‌మంత కీలక‌ వ్యాఖ్య‌లు చేశారు. స‌హ‌జంగా ఎవ‌రైనా ఐటి దాడులు అంటే భ‌య‌ప‌డ‌తారు. కానీ స‌మంత మాత్రం ఆ స‌మ‌యంలో ఐటి అధికారులు వ‌చ్చి దాడి చేసి ఆ విష‌యం త‌ప్పు అని చెపితే బాగుంటుంది అనిపించింద‌ని వ్యాఖ్యానించారు. నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకున్న స‌మ‌యంలో 250 కోట్ల రూపాయ‌లు భ‌ర‌ణం తీసుకున్నార‌ని పుకార్లు వ‌చ్చిన స‌మ‌యంలో ఇది త‌న‌కు క‌లిగిన ఫీలింగ్ అన్నారు. అది అంతా అబద్ధం అని స్ప‌ష్టం చేశారు. కాఫీ విత్ క‌ర‌ణ్ షోలో పాల్గొన్న ఆమె విడాకుల అంశంపై స్పందించారు. అదే స‌మ‌యంలో తాను భ‌విష్య‌త్ లో ప్రేమ‌లో ప‌డే ఛాన్స్ లేద‌ని స్ప‌ష్టం చేశారు. క‌ర‌ణ్ ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా మీ భ‌ర్త అని ఓ ప్ర‌శ్న వేయ‌గా..మాజీ భ‌ర్త అంటూ ఘాటుగా స్పందించారు స‌మంత‌. దీంతో సారీ చెప్పిన క‌ర‌ణ్ ప‌లు అంశాల‌పై స‌మంత నుంచి స‌మాధానాలు రాబ‌ట్టే ప్ర‌య‌త్నం చేశారు.

తాము విడిపోవ‌టం అంత సుల‌భంగా ఏమీ జ‌ర‌గ‌లేద‌ని..ఆ స‌మ‌యంలో ఎంతో సంఘ‌ర్ష‌ణ అనుభ‌వించాన‌ని..ఇప్పుడు మ‌రింత స్ట్రాంగ్ గా మారాన‌ని స‌మంత తెలిపారు. స‌ఖ్య‌త లేని స‌మ‌యంలోనే విడిపోయామ‌ని..ఆ స‌మ‌యంలో త‌మ‌ను ఒక గ‌దిలో ఎలాంటి మ‌ర‌ణాయుధాలు లేకుండా చూడాల్సిన ప‌రిస్థితి ఉంద‌న్నారు. నాగ‌చైత‌న్య‌తో విడిపోయిన కొద్దిరోజుల‌కే పుష్ప‌లో సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన ఊ అంటావా..ఉహు అంటావా పాట ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని..పురుషాదిక్య స‌మాజంలో త‌న‌లాంటి వారు చెపితేనే త‌ప్ప‌కుండా అంద‌రికీ చేరువ అవుతుంద‌ని ఈ పాట చేశాన‌ని..ఈ పాట త‌న‌కు ఎంతో న‌చ్చింద‌ని అన్నారు.

Next Story
Share it