Telugu Gateway
Cinema

కరోనా బారిన రామ్ చరణ్

కరోనా బారిన రామ్ చరణ్
X

హీరో రామ్ చరణ్ కరోనా బారిన పడ్డారు. తాజాగా ఆయన ఆచార్య షూటింగ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ తరుణంలో కరోనా పాజిటివ్ తేలటంతో చిత్ర యూనిట్ లో కలకలం రేగుతోంది. రామ్ చరణ్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తనకు కరోనా పాజిటివ్ అని తేలిందని..గత కొన్ని రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్న వారు అంతా టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్ అని తేలిందనని..త్వరలోనే కరోనా తగ్గిందనే మంచి విషయాన్ని వెల్లడిస్తానని పేర్కొన్నారు.

నా ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ తెలిజయజేస్తాను అని తన ట్వీట్ లో తెలిపారు. నాలుగు రోజుల క్రితం చరణ్‌ కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్టమస్‌ జరుపుకున్నారు. తాజాగా ఆచార్య సెట్ లో డైరెక్టర్ కొరటాల శివ, ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వ రాజన్‌ను కలిశారు. దర్శకుడు కొరటాలతో కలిసి టీ తాగుతూ అందరిని పలకరించారు.

Next Story
Share it