Telugu Gateway
Cinema

పవన్ ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ న్యూస్

పవన్ ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ న్యూస్
X

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరి హర వీర మల్లు సినిమా అసలు పూర్తి అవుతుందా లేదా అన్న చర్చ సాగుతున్న వేళ ఈ సినిమాకు సంబంధించి నిర్మాత ఆసక్తికరం విషయం వెల్లడించారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల అవుతుంది అని నిర్మాత ఏ ఎం రత్నం వెల్లడించారు. ఈ సినిమా నిర్మాణం ఆగిపోయింది అన్న ప్రచారం ఏ మాత్రం నిజం కాదు అన్నారు. తాను నిర్మిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా కావటంతో దీనిపై ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నానని తెలిపారు.

పవన్ కళ్యాణ్ నుంచి ఇరవై రోజులు డేట్స్ తీసుకుని హడావుడి గా సినిమా చుట్టేయటం సరికాదు...అందరికి గుర్తుండి పోయేలా ఇది ఉంటుంది అని తెలిపారు. కొద్ది రోజుల క్రితం కూడా చిత్ర యూనిట్ ఈ సినిమా కు సంబంధించి వీఎఫ్ఎక్స్ పనులు పలు దేశాల్లో జరుగుతున్నట్లు అప్ డేట్ ఇచ్చింది. అసలు ఈ సినిమా ఎప్పుడు వస్తుందో అని సస్పెన్స్ లో ఉన్న ప్రేక్షకులకు ఇది రెండు భాగాలుగా ఉంటుంది..అది కూడా పవన్ ను ఒక రేంజ్ లో నిలబెడుతుంది అని చెప్పటం విశేషం.

Next Story
Share it