Telugu Gateway
Cinema

త్రివిక్రమ్ సెంటిమెంట్ ను పూజా దెబ్బ కొట్టిందా!

త్రివిక్రమ్ సెంటిమెంట్ ను పూజా దెబ్బ కొట్టిందా!
X

సహజంగా టాలీవుడ్ లో హీరో, హీరోయిన్ ల హిట్ కాంబినేషన్లు చాలా ఉంటాయి. అలాగే హీరో, డైరెక్టర్ ల కాంబినేషన్లు కూడా సినిమాపై అంచనాలు పెంచుతాయి..అదిరిపోయే హిట్స్ ఇచ్చిన సందర్బాలు కూడా ఎన్నో. కానీ ఈ కాంబినేషన్ మాత్రం కొంత వెరైటీ అనే చెప్పాలి. తెలుగు లో ప్రముఖ దర్శకుడుగా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ వరసగా తన సినిమాల్లో హీరోయిన్ ఛాన్స్ పూజ హెగ్డే కే ఇస్తూ వస్తున్నారు. ఈ లైన్ చూసుకుంటే...ఎన్టీఆర్ హీరో గా నటించిన అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌, ఆ తర్వాత అల్లు అర్జున్ హీరో గా నటించిన అల వైకుంఠపురం సినిమాలో కూడా హీరోయిన్ పూజ హెగ్డే నే అన్న విషయం తెలిసిందే. వరసగా మూడవసారి కూడా మహేష్ బాబు సినిమా గుంటూరు కారం లోకి కూడా పూజా హెగ్డే నే తీసుకున్నారు. అంతే కాదు...ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఈ సినిమా పూజా కార్యక్రమంలో కూడా పూజా హెగ్డే పాల్గొన్నారు. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు పూజా హెగ్డే మహేష్ బాబు , త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న గుంటురు కారం సినిమా నుంచి తప్పుకున్నది. గత కొంత కాలంగా ఈ వార్త ప్రచారంలో ఉన్నా కూడా తాజాగా మరో హీరోయిన్ మీనాక్షి చౌదరి ఎంట్రీ ఇవ్వటంతో పూజా హెగ్డే ఎగ్జిట్ నిజమే అని తేలిపోయింది.

దీంతో వరసగా తన సినిమాలు అన్నిటిలో ఛాన్స్ ఇస్తూ వస్తున్న దర్శకుడు త్రివిక్రమ్ తో పూజా హెగ్డే కు తేడా ఎందుకొచ్చింది అన్నది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ డిస్కషన్ గా మారింది. మాములుగా మహేష్ బాబు వంటి సూపర్ స్టార్ హీరో తో సినిమాలు చేయటానికి టాప్ హీరోయిన్ లు కూడా ఎంతో ఆసక్తి చూపుతారు. అలాంటిది ఓకే చేసిన సినిమా నుంచి పక్కకు తప్పుకుంది అంటే ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది అనే చర్చ నడుస్తోంది. అయితే ఈ అంశంపై ఇంత వరకు చిత్ర యూనిట్ ఎక్కడా అధికారికంగా స్పందించలేదు. దీంతో ఇప్పుడు గుంటూరు కారం సినిమా లో మహేష్ బాబు కు జోడిగా శ్రీ లీల తో పాటు మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ అని తేలిపోయింది. ఈ విషయాన్ని మీనాక్షి నే వెల్లడించింది. ఇప్పటికే ఈ సినిమా షెడ్యూల్ ఒకటి పూర్తి అయింది అని..తాను ఫస్ట్ డే నే హీరో మహేష్ బాబు తో కలిసి నటించే సన్నివేశాల్లో పాల్గొన్నట్లు వెల్లడించి ఈ విషయాన్ని బయటపెట్టింది. మహేష్ బాబు,, త్రివిక్రమ్ ల సినిమాలో నటిస్తున్నందుకు ఎంతో హ్యాపీగా ఉన్నట్లు ప్రకటించింది.

Next Story
Share it