త్రివిక్రమ్ సెంటిమెంట్ ను పూజా దెబ్బ కొట్టిందా!
దీంతో వరసగా తన సినిమాలు అన్నిటిలో ఛాన్స్ ఇస్తూ వస్తున్న దర్శకుడు త్రివిక్రమ్ తో పూజా హెగ్డే కు తేడా ఎందుకొచ్చింది అన్నది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ డిస్కషన్ గా మారింది. మాములుగా మహేష్ బాబు వంటి సూపర్ స్టార్ హీరో తో సినిమాలు చేయటానికి టాప్ హీరోయిన్ లు కూడా ఎంతో ఆసక్తి చూపుతారు. అలాంటిది ఓకే చేసిన సినిమా నుంచి పక్కకు తప్పుకుంది అంటే ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది అనే చర్చ నడుస్తోంది. అయితే ఈ అంశంపై ఇంత వరకు చిత్ర యూనిట్ ఎక్కడా అధికారికంగా స్పందించలేదు. దీంతో ఇప్పుడు గుంటూరు కారం సినిమా లో మహేష్ బాబు కు జోడిగా శ్రీ లీల తో పాటు మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ అని తేలిపోయింది. ఈ విషయాన్ని మీనాక్షి నే వెల్లడించింది. ఇప్పటికే ఈ సినిమా షెడ్యూల్ ఒకటి పూర్తి అయింది అని..తాను ఫస్ట్ డే నే హీరో మహేష్ బాబు తో కలిసి నటించే సన్నివేశాల్లో పాల్గొన్నట్లు వెల్లడించి ఈ విషయాన్ని బయటపెట్టింది. మహేష్ బాబు,, త్రివిక్రమ్ ల సినిమాలో నటిస్తున్నందుకు ఎంతో హ్యాపీగా ఉన్నట్లు ప్రకటించింది.