ఎఫ్ 2 సినిమాకు ఇండియన్ పనోరమా అవార్డు
BY Admin21 Oct 2020 8:47 AM GMT
X
Admin21 Oct 2020 8:56 AM GMT
ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఎఫ్2 సినిమాకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. 2019 ఇండియన్ పనోరమ విభాగంలో ఎఫ్-2 సినిమాకు అవార్డు దక్కింది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. 2019 ఇండియన్ పనోరమలో ఎంపికైన ఏకైక తెలుగు సినిమా ఎఫ్-2 కావడం విశేషం. దేశ వ్యాప్తంగా వివిధ భాషలకు చెందిన 26 సినిమాలకు అవార్డులను కేంద్ర సమాచార ప్రసారశాఖ ప్రకటించింది.
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ద్వారా సినిమాల ఎంపిక చేపట్టగా..ఇందులో గతేడాది జనవరిలో విడుదలైన 'ఎఫ్ 2' సినిమాకు కేంద్ర అవార్డు లభించింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహ్రీన్ కౌర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు.
Next Story