Telugu Gateway
Cinema

ఎన్టీఆర్ షోకు ముహుర్తం ఫిక్స్

ఎన్టీఆర్ షోకు ముహుర్తం ఫిక్స్
X

క‌రోనా కార‌ణంగా వాయిదాల మీద వాయిదాలు ప‌డిన 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' ముహుర్తం ఖ‌రారైంది. అది కూడా అదిరిపోయే గెస్ట్ తో. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ లు ఇద్ద‌రూ క‌ల‌సి రాజ‌మౌళి ద‌ర్శ‌కత్వంలో ప్ర‌తిష్టాత్మ‌క సినిమా ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు లో కూడా ఇద్ద‌రూ క‌ల‌సి సంద‌డి చేయ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. రామ్ చ‌ర‌ణ్ మాత్రం అతిథిగా హాజరు అవుతున్నారు. ఆగ‌స్టు 22న తొలి ఎపిసోడ్ ప్రారంభం కానుంది.

ఇది జెమినీ టీవీలో ప్ర‌సారం కానున్న విష‌యం తెలిసిందే. 'సీటూ హీటెక్కుతుంది.. బ్రెయినూ హీటెక్కుతుంది' అంటూ చరణ్ టెన్షన్ పడడం, తారక్ రామ్ చ‌ర‌ణ్‌తో కలిసి సందడి చెయ్యడంతో కూడిన ప్రొమోను విడుద‌ల చేశారు. 'ఎవరు మీలో కోటీశ్వరులు' ప్రారంభ ఎపిసోడ్ కు ముఖ్య అతిథి తన సోదరుడు రామ్ చరణ్ వచ్చాడని ఎన్టీఆర్ సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.

Next Story
Share it