Telugu Gateway
Cinema

డబుల్ ఇస్మార్ట్ కు ఏ సర్టిఫికెట్

డబుల్ ఇస్మార్ట్ కు ఏ సర్టిఫికెట్
X

హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా కు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ జారీచేసింది. ఆగస్ట్ 15 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా లో రామ్ కు జోడిగా కావ్యా థాపర్ నటించింది. ఇప్పటికే విడుదల అయిన పాటలు...రామ్ ఫుల్ మాస్ యాక్షన్ సీన్స్ తో కూడిన ట్రైలర్ సినిమా పై అంచనాలు పెంచాయి. ఇందులో విలన్ గా బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటుడు సంజయ్ దత్ నటించారు. ఈ చిత్రం నిడివి మొత్తం 2 గంటల 42 నిమిషాల పాటు ఉంది. డబుల్ ఇస్మార్ట్ సినిమా తెలుగు తో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో కూడా విడుదల కానుంది.

సెన్సార్ పూర్తి చేసుకున్న విషయాన్ని చిత్ర యూనిట్ న్యూ లుక్ ను విడుదల చేస్తూ వెల్లడించింది. పూరి జగన్నాథ్, రామ్ ల కాంబినేషన్ లో 2019 సంవత్సరంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా విజయం సాధించింది. దీనికి కొనసాగింపుగానే ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ ను తెరకెక్కించారు. ఇస్మార్ట్ శంకర్ లో రామ్ కు జోడిగా నభా నటేష్ నటించగా...ఇతర కీలక పాత్రల్లో నిధి అగర్వాల్, సత్య దేవ్ లు నటించారు.

Next Story
Share it