Telugu Gateway
Cinema

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
X

దేవర సినిమా కు సంబంధించి దర్శకుడు కొరటాల శివ బుధవారం నాడు కీలక అప్ డేట్ ఇచ్చారు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఉండే భారీ షెడ్యూల్ ను చిత్ర యూనిట్ పూర్తి చేసుకుంది. ఈ దేవర సినిమా ఫస్ట్ అనుకున్నట్లు ఒక్క పార్ట్ గా కాకుండా రెండు భాగాలుగా రానుంది. ఈ విషయాన్ని కొరటాల శివ ఒక వీడియో ద్వారా వెల్లడించారు. మొదటి భాగం ముందు ప్రకటించినట్లుగానే వచ్చే ఏడాది ఏప్రిల్ ఐదున విడుదల కానుంది. ఎన్టీఆర్ నటించిన ఒక సినిమా రెండు భాగాలుగా విడుదల కాబోతున్న మొదటి సినిమా ఇదే. ఈ సినిమాను రెండు భాగాలుగా ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా కొరటాల శివ వెల్లడించారు.

కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసేది కావటంతో ఈ నిర్ణయం తీసుకున్నాం అని తెలిపారు. కథ విషయంలో ఎన్టీఆర్, తాను ఎంతో ఉద్వేగానికి గురి అయ్యామని..ఈ సినిమాలో ప్రతి పాత్ర ఎంతో కీలకమైనది అని...అందుకే ఇందులో నుంచి ఒక్క సన్నివేశం..ఒక్క సంభాషణ కూడా తొలగించలేము అని తెలిపారు. ఇప్పటికే పూర్తి అయిన షెడ్యూల్స్ లో వచ్చిన అవుట్ ఫుట్ తో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని...ఒక్క భాగంలో ఇంత పెద్ద కథను చెప్పటం సాధ్యం కాదు అన్నారు. అందరితో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొరటాల శివ తెలిపారు.

Next Story
Share it