అమెజాన్ లో స్ట్రీమింగ్

హీరో సంతోష్ శోభన్ కు చాలా రోజులు తర్వాత ఒక మంచి సినిమా దక్కింది. వాలెంటైన్స్ డే రోజు అయన హీరోగా నటించిన కపుల్ ఫ్రెండ్లీ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సంతోష్ శోభన్ కు జోడిగా మానస వారణాసి నటించింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా ఫిబ్రవరి 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 13 .50 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. పాన్ ఇండియా హీరో ప్రభాస్ కూడా ఈ సినిమా కోసం రంగంలోకి దిగటం ఈ మూవీ కి కలిసి వచ్చింది.



