Telugu Gateway
Cinema

బిగ్ బాస్...ఐదుగురికి రంగు పడింది

బిగ్ బాస్...ఐదుగురికి రంగు పడింది
X

బిగ్ బాస్ లో సోమవారం నాడు నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఏడవ వారం నామినేషన్ లో ఐదుగురికి 'రంగు పడింది'. ఈ రంగు పడిన వారంతా నామినేట్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ లోని వారిని జంటలుగా ఎంపిక చేసి..వాళ్లలో వాళ్ళు చర్చించుకుని నామినేట్ చేసుకోవాల్సిందిగా సూచించారు. ఇది సభ్యుల మధ్య వివాదాలకు కారణమైంది. అయితే మోనాల్, అఖిల్ ల జంటలో నామినేట్ ప్రక్రియ అందరి కంటే కూల్ గా అయిపోయిందనే చెప్పాలి. మోనాల్ తనంతట తానే ఎలాంటి వాదనకు చాన్స్ లేకుండా నామినేషన్ కు రెడీ అయింది. మిగిలిన ప్రతి జంటలోనూ వాదనలు సాగాయి. అవినాష్ కూడా ఏ మాత్రం ఇష్టం లేకుండానే నామినేషన్ కు అంగీకరించాల్సి వచ్చింది. అయితే అవినాష్ ను నామినేట్ చేసిన సోహైల్ తనకు ఓటు వేసేవాళ్లు అవినాష్ కు కూడా ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా అభ్యర్ధించారు. లాస్య, దివిల జంటలో కొద్దిసేపు వాదనలు జరిగినా దివి తనంతట తాను నామినేట్ కావటానికి ఓకే అనేసింది.

ఇక హారిక, అభిజిత్ ల జంటలో హాట్ హాట్ డిస్కషన్ జరిగింది. ఎవరెన్ని సార్లు నామినేట్ అయ్యారు అన్న అంశాలతోపాటు పలు అంశాలను లేవనెత్తారు. అయినా చివరకు అభిజిత్ నామినెట్ అయ్యారు. అయితే ఈ నామినేషన్ ప్రక్రియ ఏ మాత్రం ఫెయిర్ గాలేదని వ్యాఖ్యానించింది. అభిజిత్ సేవ్ అయ్యేంత వరకూ తాను అతనితో మాట్లాడనని హారిక ప్రకటించింది. అరియానా, మహబూబ్ ల మధ్య వాదోపవాదాలు గట్టిగా సాగినా చివరకు అరియానానే నామినేట్ అయింది. కెప్టెన్ గా ఉన్నందున నోయల్, అరగుండు ఛాలెంజ్ స్వీకరించిన అమ్మ రాజశేఖర్ లు ఈ వారం నామినేషన్ నుంచి సేవ్ అయ్యారు.

Next Story
Share it