'భీమ్లానాయక్' ట్రైలర్ వచ్చేసింది

సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు సహకారం అందించారు. మళయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియంకు ఇది రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో నిత్యామీనన్, సంయుక్తా మీనన్ లు సందడి చేయనున్నారు. తొలుత సోమవారం రాత్రి 8,10 గంటలకు ట్రైలర్ విడుదల చేస్తామని ప్రకటించిన చిత్ర యూనిట్ చెప్పిన దాని కంటే మరింత ఆలశ్యంగా తొమ్మిది గంటలకు ట్రైలర్ ను విడుదల చేసింది. భీమ్లానాయక్ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచిందనే చెప్పాలి.