Telugu Gateway
Cinema

'బీమ్లానాయ‌క్' సెన్సార్ పూర్తి

బీమ్లానాయ‌క్ సెన్సార్ పూర్తి
X

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ద‌గ్గుబాటి రానాలు న‌టించిన సినిమా ' బీమ్లానాయ‌క్' ఈ నెల 25న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. శుక్ర‌వారం నాడు ఈ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు సినిమాకు యూ-ఏ స‌ర్టిఫికెట్ జారీ చేసింది. బీమ్లానాయ‌క్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర యూనిట్ వెల్ల‌డించింది. సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు జోడీగా నిత్యామీన‌న్ న‌టించింది. ప‌లు వాయిదాల అనంత‌రం చిత్ర యూనిట్ స‌డ‌న్ గా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించి అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది.

వాస్త‌వానికి ఏపీలో సినిమా టిక్కెట్ ధ‌ర‌ల అంశం ఇంకా కొలిక్కిరాక‌పోయిన స‌రే చిత్ర యూనిట్ ముందుకెళ్ళాల‌ని నిర్ణ‌యించింది. అయితే క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టడంతో థియేట‌ర్ల‌లో వంద శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇవ్వ‌టం యూనిట్ కు ఒకింత ఊర‌ట క‌ల్పించే ప‌రిణ‌మాంగా చెప్పుకోవ‌చ్చు.. ధ‌ర‌ల విష‌యం ఖ‌చ్చితంగా నెలాఖ‌రుకు మాత్ర‌మే వ‌స్తుంద‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది.

Next Story
Share it