Telugu Gateway
Cinema

హీరోయిన్లు గా కీర్తి సురేష్, కృతి శెట్టి

హీరోయిన్లు గా కీర్తి సురేష్, కృతి శెట్టి
X

టాలీవుడ్ లో ఇప్పుడు వరస విజయాలతో దూసుకెళుతున్న డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ముందు వరుసలో ఉన్నారు. ఆయనతో సినిమా అంటే చాలు కమర్షియల్ హిట్ ఖాయం అన్నట్లు టాలీవుడ్ లో ఫిక్స్ అయింది. గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ డూపర్ హిట్ దక్కించుకున్న అనిల్ రావిపూడి..ఈ ఏడాది సంక్రాంతికి కూడా మన శంకరవరప్రసాద్ సినిమాతో మరో సూపర్ హిట్ దక్కించుకున్నారు. ఈ రెండు సినిమాలు వరుసగా ప్రపంచ వ్యాప్తంగా ఒక్కొక్కటి 300 కోట్ల రూపాయల గ్రాస్ క్లబ్ లోకి చేరినవే కావటం విశేషం. కొద్ది రోజుల క్రితమే వెంకటేష్, కళ్యాణ్ రామ్ తో కలిసి కొత్త సినిమా చేయబోతున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించిన సంగతి తెలిసిందే. గురువారం నాడు హైదరాబాద్ లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి.

ఇందులో వెంకటేష్, కళ్యాణ్ రామ్ తో పాటు హీరోయిన్లు కీర్తి సురేష్, కృతిశెట్టిలు పాల్గొన్నారు. వెంకటేష్ సరసన తొలిసారి కీర్తి సురేష్ నటిస్తుంటే...కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి నటిస్తోంది. ఈ సినిమాను కూడా దర్శకుడు అనిల్ రావిపూడి తనకు కలిసి వచ్చిన వచ్చే సంక్రాంతికి విడుదల చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ పూజా కార్యక్రమంలో ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ 22 నుండి ప్రారంభం కానుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సాహు గారపాటి ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 మూవీ లో నటిస్తున్నారు.

Next Story
Share it