Telugu Gateway
Cinema

దుబాయ్ లో మైనపు విగ్రహం

దుబాయ్ లో మైనపు విగ్రహం
X

దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఏర్పాటు అయింది. ఈ విగ్రహాన్ని స్వయంగా ఆయనే కుటుంబ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. దీనికి సంబంధించిన ఫోటో లను స్నేహ రెడ్డి ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు. అల్లు అర్జున్ కూడా ఈ ఫోటో ను షేర్ చేస్తూ తగ్గేదేలే.. దుబాయ్ మేడమ్ టుస్సాడ్స్ అంటూ ఈ విగ్రహం ఫోటో ను సోషల్ మీడియా లో పంచుకున్నారు. దుబాయ్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం లో చోటు దక్కించుకున్న టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఒక్కరే కావటం విశేషం.

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఆగస్ట్ 15 న విడుదల కానుంది. పుష్ప 2 తర్వాత పుష్ప ది రోర్ పేరుతో మూడవ పార్ట్ కూడా తెరకెక్కే అవకాశం ఉంది అనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పుష్ప 2 సినిమాకు సంబంధించిన టీజర్ తో కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రకటనలు ఏప్రిల్ నెలలో ఉండే అవకాశం ఉంది అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీటిపై అధికార ప్రకటనలు త్వరలోనే రానున్నాయి.

Next Story
Share it