నెగిటివ్ టాక్ లోనూ దూసుకెళుతున్న ఆదిపురుష్

వివాదాల నేపథ్యంలో ఆదిపురుష్ చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటి అంటే హనుమంతుడితో పలికించిన డైలాగ్స్ పై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతుండటంతో వాటిలో మార్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వెంటనే మార్పులు చేసి..సినిమాను ప్రదర్శిస్తామని తెలిపారు. హనుమంతుడి డైలాగ్స్ పై విమర్శలు ఏ మాత్రం ఆగకపోవటం చిత్ర యూనిట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తమకు ప్రేక్షుకుల మనోభావాలే ముఖ్యం అంటూ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది అంతా ఒకెత్తు అయితే ఇంత నెగిటివ్ టాక్ వచ్చిన సినిమా కు కూడా ప్రభాస్ రెండు రోజుల్లో 240 కోట్ల రూపాయల వసూళ్లు సాధించాడు అంటే అది తమ హీరో సత్తా అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు పెడుతున్నారు.