Telugu Gateway
Cinema

ఆదిపురుష్ 'అప్ డేట్' ఇచ్చిన ప్రభాస్

ఆదిపురుష్ అప్ డేట్ ఇచ్చిన ప్రభాస్
X

ప్రభాష్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమా 'ఆదిపురుష్'. ఈ సినిమాకు సంబంధించి హీరో ప్రభాస్ మంగళవారం నాడు ఓ అప్ డేట్ అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కన్పించబోతున్నాడు. భారీ కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించిన మోషన్ క్యాప్చర్ పనులకు ఇటీవలే ప్రారంభించారు. మోషన్ క్యాప్చర్ బృందంతో కలిసి డైరెక్టర్ ఓం రౌత్ తీసుకున్న ఫొటోను ప్రభాస్ షేర్ చేశారు. 'మోషన్ క్యాప్చర్ స్టార్టయ్యింది.

'ఆదిపురుష్' ప్రపంచాన్ని క్రియేట్ చేస్తున్నారు'అని ప్రభాస్ పోస్ట్‌ లో పేర్కొన్నారు. ఓవైపు గ్రాఫిక్స్ సంబంధించి పనులు చేస్తూనే మరోవైపు రియల్ క్యారెక్టర్స్‌ తో షూటింగ్ చేయనుంది. ఈ చిత్రీకరణ కూడా త్వరలోనే ప్రారంభంకానుంది. ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్ మాత్రమే ఖరారయ్యారు. సుమారు 300 కోట్లతో ఆదిపురుష్‌ తెరకక్కించబోతున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోనన ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్ట్‌ 11న హిందీతో పాటు, తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ, క‌న్న‌డ‌ భాష‌ల్లో విడుదలకానుంది.

Next Story
Share it