Telugu Gateway
Cinema

తెలంగాణలో 'ఆచార్య‌' టిక్కెట్ ధ‌ర‌లు పెంపు

తెలంగాణలో ఆచార్య‌ టిక్కెట్ ధ‌ర‌లు పెంపు
X

మ‌రో సినిమాకూ తెలంగాణ స‌ర్కారు టిక్కెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమ‌తి ఇచ్చింది. తొలుత ఆర్ఆర్ఆర్ కు, త‌ర్వాత కెజీఎఫ్ కు రేట్లు పెంచుకోవ‌టానికి, అద‌న‌పు షోల‌కు అనుమ‌తి ఇచ్చారు. ఇప్పుడు ఆచార్య వంతు వ‌చ్చింది. సేమ్ టూ సేమ్ ఆ సినిమాల‌కు ఎలా ఛాన్స్ ఇచ్చారో ఆచార్య‌కు కూడా అదే త‌ర‌హాలో రేట్ల పెంపున‌కు. ఐద‌వ ఆట‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి, రామ్‌చరణ్‌ నటించిన చిత్రం​ ఆచార్య. సురేఖ కొణిదెల సమర్పణలో నిరంజన్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదలవుతున్న విష‌యం తెలిసిందే. ఈనెల 29 నుంచి మే5 వరకు టికెట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీని ప్రకారం ఒక్కో టికెట్‌పై మల్టీప్లెక్స్‌లో రూ. 50, సాధారణ థియేటర్స్‌లో రూ. 30 పెంచుకునేలా వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా ఆచార్య ఐదో ఆట ప్రదర్శనకు వారం రోజుల పాటు అనుమతి కల్పించింది.

Next Story
Share it