Telugu Gateway
Cinema

రెజీనాతో సానా క‌ష్టం అంటున్న చిరంజీవి

రెజీనాతో సానా క‌ష్టం అంటున్న చిరంజీవి
X

'ఆచార్య‌' సినిమా నుంచి కొత్త పాట వ‌చ్చింది. ఈ పాట‌లో మెగాస్టార్ చిరంజీవితో క‌ల‌సి రెజీనా సంద‌డి చేసింది. 'క‌ల్లోలం క‌ల్లోలం..ఊరువాడా క‌ల్లోలం నేనొస్తే అల్ల‌క‌ల్లోలం. క‌ల్లోలం..క‌ల్లోలం కిందా మీద క‌ల్లోలం.' అంటూ రెజీనా ఎంట్రీతో మొద‌లైన ఈ పాట‌..చిరు రాక‌తో మ‌రింత జోరందుకుంటుంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తే...రామ్ చ‌ర‌ణ్ కుజోడీ పూజా హెగ్డె సంద‌డి చేసింది. రెజీనాను ప్ర‌త్యేకంగా ఈ పాట కోసం తీసుకున్న‌ట్లు క‌న్పిస్తోంది. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 4న ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. కొత్త‌గా విడుద‌లైన సానా క‌ష్టం పాట ఆక‌ట్టుకునేలా ఉంది.

Next Story
Share it