Telugu Gateway
Cinema

ప‌ది మంది ఆడాళ్లు ఓ అమ్మాయిని ఓకే చేయ‌టం న‌ర‌క‌మే

ప‌ది మంది ఆడాళ్లు ఓ అమ్మాయిని ఓకే చేయ‌టం న‌ర‌క‌మే
X

'ప్ర‌తి మ‌గాడి జీవితంలోనూ పెళ్లి అనేది ఓ ముఖ్య‌మైన ఘ‌ట్టం. కానీ ఇంట్లో ఓ ప‌ది ఆడాళ్లు ఉండి పెళ్లికి ఓ అమ్మాయిని ఓకే చేయ‌టం అంటే ఇంచు మించు న‌ర‌కం.' అంటూ హీరో శ‌ర్వానంద్ చెప్పే డైలాగ్ తో ఆడ‌వాళ్లు మీకు జోహ‌ర్లు సినిమా టీజ‌ర్ క‌ట్ చేశారు. ఆ అమ్మాయికి నువ్వు న‌చ్చ‌లేదంట‌రా అంటూ రాధిక శ‌ర్వానంద్ తో చెప్ప‌గానే...మ‌నం రిజెక్ట్ చేసే స్టేజ్ నుంచి వాళ్ళు రిజెక్ట్ చేసే స్టేజీకి తీసుకొచ్చార‌న్న మాట అంటూ శ‌ర్వానంద్ విచిత్ర‌మైన న‌వ్వుల‌తో చెప్పే డైలాగ్ ఆక‌ట్టుకుంది. ఆ త‌ర్వాత శ‌ర్వానంద్, ర‌ష్మిక మంద‌న‌ల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు కూడా స‌ర‌దా స‌ర‌దాగా సాగాయి. తిరుమ‌ల కిషోర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 25న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ సినిమాలో రాధిక‌, కుష్భూ, ఊర్వ‌శిలు కూడా కీల‌క పాత్ర‌లు పోషించారు.

Next Story
Share it