విజయసాయిరెడ్డి స్థలాలకూ..కులాల వారీగా సీలింగ్ పెడతారేమో!

గతంలో ఎప్పుడో ఈ భూములన్నింటిని కొనుగోలు చేసి ఈ రోజు ఉత్తరాంధ్రకు క్యాపిటల్ రాకూడదు. అమరావతే క్యాపిటల్ ఉండాలి. కానీ ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందకూడదు. అమరావతి అభివృద్ధి చెంది..ఉత్తరాంద్రలో మాత్రం ఆస్తుల విలువ పెంచుకోవాలని చూస్తున్నారు. ఈ ఒకే ఒక దురుద్దేశం వీళ్లలో కనపడుతోంది. దానికి ఈ కుల మీడియా అంతా తోడ్పడుతుంది అంటూ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించి కొత్త చర్చకు తెరలేపారు. మరి విజయసాయిరెడ్డి ఇదే లాజిక్ ను అప్లయ్ చేసి..వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వియ్యంకుడి కంపెనీ జీఎంఆర్ నుంచి కొనుగోలు చేసిన కాకినాడ సెజ్ భూములు కూడా ఆ ప్రాంతంలో కులాల వారీగా పంచుతారా? సీఎం జగన్ కు చెందిన ఇడుపులపాయ ఎస్టేట్ భూములను కూడా కులాల వారీగా పంపటానికి విజయసాయిరెడ్డి ఒప్పిస్తారా?. అసలు ఇదేమి లెక్క. దేశంలో అయినా..రాష్ట్రంలో అయినా ఎవరి దగ్గర డబ్బులు వాళ్లు భూములు కొంటారు..వ్యాపారాలు చేసుకుంటారు. కొంత మంది అదికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకుంటారు కూడా. దేశంలో భూములు అన్నీ కులాల జనాభా ప్రాతిపదికనే పంచాలని వైసీపీతో ఎంతో సఖ్యతతో ఉన్న బిజెపి సర్కారు మాట్లాడి ఒప్పిస్తే ఓ పనైపోతుంది. అంతే కాదు..దేశ చరిత్రలోనే విజయసాయిరెడ్డి పేరు స్వర్ణాక్షరాలతో లిఖిస్తారు కూడా.