Telugu Gateway
Andhra Pradesh

విజ‌య‌సాయిరెడ్డి స్థ‌లాల‌కూ..కులాల వారీగా సీలింగ్ పెడ‌తారేమో!

విజ‌య‌సాయిరెడ్డి స్థ‌లాల‌కూ..కులాల వారీగా సీలింగ్ పెడ‌తారేమో!
X

అస‌లు వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డికి ఏమైంది?. ఎందుకింత ఫ్ర‌స్టేష‌న్ లో ఉన్నారు. మంగ‌ళ‌వారం నాడు ఆయ‌న మీడియా స‌మావేశంలో ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు చూస్తే ఎవ‌రికైనా ఇదే అనుమానం రాక‌మాన‌దు. విజ‌య‌సాయిరెడ్డికి అధికారం అప్ప‌గిస్తే స్థ‌లాల‌కూ..కులాల వారీ సీలింగ్ పెట్టేలా ఉన్నారు. దేశంలో ఎక్క‌డా లేని కొత్త, చెత్త‌, విచిత్ర‌మైన లాజిక్ ను ఆయ‌న తీసుకొచ్చి త‌న‌పై వ‌స్తున్న భూస్కామ్ ల వ్య‌వ‌హారాన్ని పక్క‌దారి ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. దేశంలో వ్యాపారాలే కాదు, దేశ సంప‌ద అంతా అదానీ, అంబానీలు, గుజ‌రాతీల చేతుల్లోనే ఉంది అంద‌రికీ పంచాల‌ని డిమాండ్ చేస్తారా?. ఆయ‌న మీడియా స‌మావేశంలో చేసిన వ్యాఖ్య‌లు చూసి అంతా షాక్ అవుతున్నార‌నే చెప్పొచ్చు. విశాఖ‌ప‌ట్నంలో ఇంచుమించుగా 75 నుంచి 80 శాతం భూముల‌న్నీ కూడా ఒక సామాజిక వ‌ర్గం చెందిన వాళ్ల‌కే ఉన్నాయి. నిజానికి విశాఖ‌ప‌ట్నంలో కానీ..ఉత్త‌రాంధ్ర‌లో కానీ సామాజిక‌వ‌ర్గ‌ప‌రంగా చూసుకుంటే...కాపులు, యాద‌వులు..మిగ‌తా వెన‌క‌బ‌డిన వ‌ర్గాల వారు బీసీలు ఎక్కువ ఉన్నారు. వెల‌మ‌లు, కాళింగ‌లు ఎక్కువ ఉన్నారు. ఆస్తుల‌న్నీ చంద్ర‌బాబు సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వి. జ‌నాభామాత్రం వేరే సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారు.

గ‌తంలో ఎప్పుడో ఈ భూముల‌న్నింటిని కొనుగోలు చేసి ఈ రోజు ఉత్త‌రాంధ్ర‌కు క్యాపిటల్ రాకూడ‌దు. అమ‌రావ‌తే క్యాపిట‌ల్ ఉండాలి. కానీ ఉత్త‌రాంధ్ర అభివృద్ధి చెంద‌కూడ‌దు. అమ‌రావ‌తి అభివృద్ధి చెంది..ఉత్త‌రాంద్ర‌లో మాత్రం ఆస్తుల విలువ పెంచుకోవాల‌ని చూస్తున్నారు. ఈ ఒకే ఒక దురుద్దేశం వీళ్ల‌లో క‌న‌ప‌డుతోంది. దానికి ఈ కుల మీడియా అంతా తోడ్ప‌డుతుంది అంటూ విజ‌య‌సాయిరెడ్డి వ్యాఖ్యానించి కొత్త చ‌ర్చ‌కు తెర‌లేపారు. మ‌రి విజ‌యసాయిరెడ్డి ఇదే లాజిక్ ను అప్ల‌య్ చేసి..వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఆయ‌న వియ్యంకుడి కంపెనీ జీఎంఆర్ నుంచి కొనుగోలు చేసిన కాకినాడ సెజ్ భూములు కూడా ఆ ప్రాంతంలో కులాల వారీగా పంచుతారా? సీఎం జ‌గన్ కు చెందిన ఇడుపుల‌పాయ ఎస్టేట్ భూముల‌ను కూడా కులాల వారీగా పంప‌టానికి విజ‌య‌సాయిరెడ్డి ఒప్పిస్తారా?. అస‌లు ఇదేమి లెక్క. దేశంలో అయినా..రాష్ట్రంలో అయినా ఎవ‌రి ద‌గ్గ‌ర డ‌బ్బులు వాళ్లు భూములు కొంటారు..వ్యాపారాలు చేసుకుంటారు. కొంత మంది అదికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకుంటారు కూడా. దేశంలో భూములు అన్నీ కులాల జ‌నాభా ప్రాతిప‌దిక‌నే పంచాల‌ని వైసీపీతో ఎంతో స‌ఖ్య‌త‌తో ఉన్న బిజెపి స‌ర్కారు మాట్లాడి ఒప్పిస్తే ఓ ప‌నైపోతుంది. అంతే కాదు..దేశ చ‌రిత్రలోనే విజ‌యసాయిరెడ్డి పేరు స్వ‌ర్ణాక్షరాల‌తో లిఖిస్తారు కూడా.

Next Story
Share it