Telugu Gateway
Andhra Pradesh

జగన్ తలచుకుంటే టీడీపీకి సింగిల్ డిజిట్ సీట్లు కూడా రావు

జగన్ తలచుకుంటే టీడీపీకి సింగిల్ డిజిట్ సీట్లు కూడా రావు
X

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధానిగా లేకపోతే చంద్రబాబుకు తప్ప ఎవరికీ నష్టం లేదన్నారు. చంద్రబాబు కుటుంబ ఆస్తులు అన్నీ అమరావతిలోనే ఉన్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను 33 శాతం పూర్తి చేసి 77 శాతం అని చెప్పుకుంటున్నారని విమర్శించారు. కర్నూలు జిల్లా పర్యటనలో మంత్రి మీడియాతో మాట్లాడారు.

పోతిరెడ్డిపాడు విస్తరణ ప్రాజెక్టుపై చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడరన్నారు. చంద్రబాబుకు రిటైర్ మెంట్ వయస్సు దాటిపోయిందని ఆయన విశ్రాంతి తీసుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏ సమస్యా లేదు కాబట్టే చంద్రబాబు హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్నారని అన్నారు. జగన్ తలచుకుంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి సింగిల్ డిజిట్ సీట్లు కూడా రావవన్నారు.

Next Story
Share it