Telugu Gateway
Andhra Pradesh

పెళ్లి వ్యాన్ బోల్తా..ఏడుగురు మృతి

పెళ్లి వ్యాన్ బోల్తా..ఏడుగురు మృతి
X

అప్పటివరకూ పెళ్లి సందడి. బంధువుల హడావుడి. వేడుక ముగిసింది. ఎవరి ఇంటికి వాళ్లు బయలుదేరారు. ఆ తరుణంలో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి వ్యాను బోల్తా పడి ఏడుగురు చనిపోయారు. ఈ వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. జిల్లాలోని గోకవరం మండలం ఠాకూర్ పాలానికి చెందిన యువకుడు, రాజానగరం మండలం వెలుగుబందాకు చెందిన యువతికి గురువారం రాత్రి తంటికొండ కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో వివాహం జరిగింది.

పెళ్లి ముగించుకుని వస్తున్న సమయంలో వ్యాన్ బోల్తా కొట్టడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఆలయంలో పార్కింగ్ ప్లేస్ మీదుగా రోడ్డు మీదికి రావాల్సిన వ్యాన్‌ మెట్లు పై నుంచి ఒక్కసారిగా కింద పడినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాద సమయంలో వ్యాన్‌లో 17 మంది పెళ్లి బృందం ఉన్నారు. మృతులు శ్రీదేవి, శ్రీలక్ష్మి, భాను, ప్రసాద్‌, దొరగా పోలీసులు గుర్తించారు.

పెళ్లి వ్యాన్ బోల్తా..ఏడుగురు మృతి

Next Story
Share it