Telugu Gateway
Andhra Pradesh

ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌వ సందేహాలు

ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌వ సందేహాలు
X

వైసీపీ ప్లీన‌రీ వేళ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ ట్వీట్ చేశారు. అందులో ఆయ‌న న‌వ సందేహాలు అంటూ ప‌లు ప్ర‌శ్న‌లు సంధించారు. వైసీపీ ప్రభుత్వం చెబుతున్న నవరత్నాలు పథకాల అమలుపై లేవనెత్తిన నవ సందేహాలు ఇవి..

నవ సందేహాలు

*మొదటి రత్నం – రైతు భరోసా

64 లక్షల మందికి మేలు అని చెప్పి.. 50 లక్షల మందికే భరోసా ఇవ్వడం నిజం కాదా?

మూడేళ్లలో 3 వేలమంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకొంటే కేవలం 700మందికే ఆర్థిక సాయాన్ని పరిమితం చేయలేదా?

రెండో రత్నం – అమ్మ ఒడి

అమ్మ ఒడి 43 లక్షల మందికి మాత్రమే ఇచ్చి.. 83 లక్షల మందికి ఇచ్చామని ఎందుకు అబద్దపు ప్రచారం చేస్తున్నారు?

మూడో రత్నం - పెన్షన్లు

పెన్షనర్ల జాబితాను కుదించి 5 లక్షల మందిని తొలగించిన మాట వాస్తవం కాదా?

నాలుగో రత్నం – సంపూర్ణ మద్యపాన నిషేధం

మద్యం ఆదాయం 2018-19లో రూ.14 వేల కోట్లు... 2021-22లో రూ.22 వేల కోట్లు – ఇదేనా మద్య నిషేధం? ఈ ఆదాయం చూపించే రూ.8 వేల కోట్లు బాండ్లు అమ్మలేదా?

అయిదో రత్నం – జల యజ్ఞం

పోలవరం ప్రాజెక్టును 'యుద్ద ప్రాతిపదిక'న ఎప్పుడు పూర్తి చేస్తారో చెబుతారా?

*ఆరో రత్నం – ఆరోగ్యశ్రీ

ఆరోగ్యశ్రీ పథకం నుంచి ఆసుపత్రులు ఎందుకు పక్కకు తప్పుకొంటున్నాయి? సి.ఎమ్.ఆర్.ఎఫ్. నుంచి వైద్యం ఖర్చులు ఎందుకు చెల్లించడం లేదు?

*ఏడో రత్నం – ఫీజు రీ యింబర్స్ మెంట్

రీ యింబర్స్ మెంట్ చేయకపోవడం వల్లే విద్యార్థులకు హాల్ టికెట్స్ ఆపేస్తున్న మాట నిజం కాదా? పీజీ విద్యార్థులకు ఫీజు చెల్లింపులు ఎందుకు నిలిపివేశారు?

*ఎనిమిదో రత్నం – పేదలందరికీ ఇళ్ళు

చెరువుల్లో, గుట్టల్లో స్థలాలు ఇచ్చిన మాట నిజమే కదా? ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఎందుకు మంజూరు చేయలేదు?

*తొమ్మిదో రత్నం – ఆసరా

పొదుపు సంఘాల సంఖ్యను ఏటేటా లక్షల కొద్దీ ఎందుకు తగ్గిస్తున్నారు? అభయ హస్తం నిధులు రూ.2 వేల కోట్లు ఎటుపోయాయి?

Next Story
Share it