Telugu Gateway
Andhra Pradesh

ఏపీ సరిహద్దుల వరకూ ఆర్టీసీ బస్సులు

ఏపీ సరిహద్దుల వరకూ ఆర్టీసీ బస్సులు
X

దసరా పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ఏపీ సరిహద్దు చెక్ పోస్ట్ లు - పంచలింగాల, గరికపాడు, వాడపల్లి, పైలాన్, జీలుగుమిల్లి, కల్లుగూడెం ల వద్ద ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంచామని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ అవకాశం ప్రజలు వినియోగించుకోవాలని మంత్రి కోరారు. ఆర్టీసి బస్ సేవల గురించి చెబుతూ వ్యాపార ధోరణితో రెండు తెలుగు రాష్ట్రాలు వ్యవహరించడం లేదని, కేవలం ప్రజలకు రవాణా సౌకర్యం పునరుద్దరించాలనే ఉద్దేశంతో ఏపీఎస్ ఆర్టీసీ 1.04 లక్షల కి.మీ. తగ్గించుకుందని, 1.61 లక్షల కి.మీకే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ అధికారు లు కోరినట్లే ప్రతిపాదనలు పంపిస్తూ, రూట్ల వారీగా స్పష్టత కూడా ఇచ్చామని, ఈ ప్రతిపాదనలతో ఏపీ ఎస్ ఆర్టీసీ లాభ నష్టాలను చూడకుండా కేవలం ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా టీఎస్ ఆర్టీసీ డిమాండ్లకు అనుకూలంగా ప్రతిపాదనలు పంపామని, ఇరు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణంలో జూన్ 18వ తేదీ నుంచి చర్చలు జరుపుతున్నామని మంత్రి అన్నారు.

ఆర్టీసీ కార్గో సేవలు మాత్రం కోవిడ్ సమయంలో సైతం కొనసాగుతున్నయని పేర్ని నాని తెలిపారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి, బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించేవారికి, జీవితం పట్ల అవగాహన లేని వారికి సరైన క్రమశిక్షణ నేర్పించే ఉద్దేశంతోనే జరిమానాలు పెంచామన్నారు. హైదరాబాద్ లోని లేక్ వ్యూ అతిథి గృహంలో మంత్రి శనివారం మీడియాతో మాట్లాడారు. వాహనాలకు సంబంధించి సక్రమమైన పేపర్లు కలిగి, రూల్ పాటిస్తూ వాహనాలు నడిపేవారికి ఈ విధానం శ్రీరామ రక్షగా నిలుస్తుంది అని, దీన్ని సామాజిక బాధ్యతగా వాహనదారులు భావించాలన్నారు.

Next Story
Share it