ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన కల్వకుంట్ల కవిత

Update: 2020-10-29 08:34 GMT

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన కల్వకుంట్ల కవిత గురువారం నాడు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. కవితతో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. వాస్తవానికి కవిత అక్టోబర్ 14నే ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉన్నా..తనను కలసిన ఎమ్మెల్యేకు కరోనా రావటంతో ఆమె ముందు జాగ్రత్త చర్యగా ఐసోలేషన్ కు వెళ్ళారు. దీంతో సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆమె ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. కవిత ప్రమాణ స్వీకారానికి మంత్రులు ప్రశాంత్ రెడ్డి , సత్యవతి రాథోడ్ పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు హాజరయ్యారు.

Tags:    

Similar News