తెలంగాణలో రిజిస్ట్రేషన్లు బంద్
BY Telugu Gateway7 Sept 2020 4:37 PM IST

X
Telugu Gateway7 Sept 2020 4:37 PM IST
తెలంగాణ సర్కారు మంగళవారం నుంచి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు అన్నీ బంద్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకూ రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నట్ల తెలిపారు. అయితే డీడ్స్, పెళ్ళిళ్ళ రిజిస్ట్రేషన్లు, ఫ్రాంకింగ్ సర్వీసులు మాత్రం కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు రిజిస్ట్రేషన్ అండ్ ప్రాపర్టీ డాక్యుమెంట్లలో మార్పులు చేయనున్నట్లు తెలిపారు. దీని కోసమే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Next Story