Telugu Gateway
Top Stories

లొంగిపోయిన నిర్మాత అశోక్ రెడ్డి

లొంగిపోయిన  నిర్మాత అశోక్ రెడ్డి
X

టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఇప్పటికే పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేయగా మూడో నిందితుడు అశోక్ రెడ్డి బుధవారం నాడు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వాస్తవానికి ఆయన సోమవారం నాడు విచారణకు వస్తానని చెప్పి..అదృశ్యం అయ్యారు. శ్రావణి మృతి కేసులో ఏ 3 నిందితుడు అశోక్‌రెడ్డి పంజాగుట్ట పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఏసీపీ తిరుపతన్న అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కరోనా పరీక్షల కోసం నిందితుడిని ఎస్సార్‌ నగర్‌ పీహెచ్‌సీకి తరలించారు.

వైద్య పరీక్షల అనంతరం అశోక్‌రెడ్డిని పోలీసులు కోర్టులో హాజరు పరచనున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఏ 1 దేవ్‌రాజ్‌ రెడ్డి, ఏ 2 సాయికృష్ణారెడ్డిలు పోలీసుల రిమాండ్‌లో ఉన్నారు. ఈ ముగ్గురి వేధింపుల వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. అశోక్‌రెడ్డి ఆర్‌ఎక్స్‌ 100 సినిమా నిర్మాతగా వ్యవహరించారు.

Next Story
Share it