Telugu Gateway
Cinema

అక్టోబర్ 2న ఓటీటీలో ‘నిశ్శబ్దం’ విడుదల

అక్టోబర్ 2న ఓటీటీలో ‘నిశ్శబ్దం’ విడుదల
X

అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘నిశ్శబ్దం’ చిత్ర యూనిట్ చివరకు ఓటీటీ బాట పట్టింది. అసలు థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో తెలియని పరిస్థితుల్లో మరో మార్గం లేక చిత్ర యూనిట్ ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయటానికి ముహుర్తం నిర్ణయించుకుంది. అక్టోబర్ 2న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు హేమంత్ మధుకర్ వెల్లడించారు. అనుష్కతో పాటు ఈ సినిమాలో మాధవన్, అంజలీ, షాలినీ పాండే తదితరులు కీలక పాత్రలు పోషించారు.

థియేటర్ లో సినిమా విడుదలకే తమ ప్రథమ ప్రాధాన్యత అనుకున్నామని..కానీ పరిస్థితులు ఏ మాత్రం అనుకూలంగా లేకపోవటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు చిత్ర నిర్మాత కోన వెంకట్ తెలిపారు. రెండున్నర సంవత్సరాలు కష్టపడి పనిచేసిన ప్రాజెక్టు ఇలా ఓటీటీలో విడుదల చేయాల్సి రావటం బాధాకరంగానే ఉన్నా..పరిస్థితులు తమ చేతుల్లో లేకుండా పోయాయన్నారు.

Next Story
Share it