Telugu Gateway
Telangana

మెట్రో రైళ్ళలో 75 శాతం ఫ్రెష్ ఎయిర్

మెట్రో రైళ్ళలో 75 శాతం ఫ్రెష్ ఎయిర్
X

సోమవారం నుంచి హైదరాబాద్ లో మెట్రో రైళ్ళు ప్రారంభం కానున్న తరుణంలో ఏర్పాట్ల గురించి హైదరాబాద్ మైట్రో రైలు ఎండీ ఎన్ వీ ఎస్ రెడ్డి ఏర్పాట్ల గురించి మీడయాకు వివరించారు. కరోనాకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైలులు భౌతిక దూరం తప్పనిసరి అని స్పష్టం చేశారు. ‘మార్కింగ్ కు తగ్గట్టుగా ప్రయాణీకులు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నిత్యం స్టేషన్ పరిసరాలను శానిటైజ్ చేస్తాం. నగదు రహిత రూపంలో ఆన్ లైన్, స్మార్ట్ కార్డ్, క్యూ ఆర్ కోడ్ యూజ్ చేయాలి.

ప్రతి 5 నిముషాలకు ఒక ట్రైన్ అందుబాటులో ఉంటుంది. రద్దీని బట్టి వేళల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. ఫేస్ మాస్క్ తప్పనిసరి. లేనివారు స్టేషన్ లో కొనుక్కోవాలి? ప్రతి ప్రయాణీకుడిని థర్మల్ స్క్రీనింగ్ చేస్తాం. నార్మల్ టెంపరేచర్ ఉంటేనే అనుమతి. హ్యాండ్ శానిటైజర్ నిత్యం అందుబాటులో ఉంటుంది. మెటల్ ఐటమ్స్ లేకుండా మినిమం బ్యాగేజ్ తో రావాలి. అక్కడక్కడ టెర్మినల్స్ వద్ద ట్రైన్ డోర్లు కొద్దిసేపు తెరిచి ఉంచుతాము. ప్రతి స్టేషన్ లో ఐసోలేషన్ రూంల ఏర్పాటు’ చేస్తున్నట్లు తెలిపారు.

Next Story
Share it