Telugu Gateway
Telangana

శ్రావణి ఆత్మహత్య కేసు..పరారీలో అశోక్ రెడ్డి

శ్రావణి ఆత్మహత్య కేసు..పరారీలో అశోక్ రెడ్డి
X

టీవీ నటి శ్రావణి ఆత్మహత్యకు ట్రయాంగిల్ లవ్ స్టోరీనే కారణంగా భావిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. ముగ్గురు మధ్య ఒత్తిడితో ఆమె ఎటూ తేల్చుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. శ్రావణి ఆత్మహత్య కేసులో పోలీసులు దేవరాజ్, సాయిలను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్ఎక్స్ 100 నిర్మాత అశోక్ రెడ్డి పరారీలో ఉన్నారు. శ్రావణి ఆత్మహత్య చేసుకునే ముందు దేవరాజ్ కు ఫోన్ చేసిందని పోలీసులు వెల్లడించారు.

పెళ్ళి చేసుకుంటానని దేవరాజ్ ఆమెను మోసం చేశారని తెలిపారు. దేవరాజ్ తో శ్రావణి స్నేహంగా ఉండటం సాయికి నచ్చలేదని...అది వీరిద్దరి మధ్య గొడవకు కారణమైందని తెలిపారు. శ్రావణి బాగు కోసమే ఆమె కుటుంబ సభ్యులు ప్రయత్నించారని, ఈ కేసులో కుటుంబ సభ్యుల పాత్ర ఏమీ లేదని తెలిపారు. దేవరాజ్ ను కలవొద్దని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారన్నారు. దేవరాజ్‌ పెళ్లికి నిరాకరించడం, సాయి వేధింపులకు పాల్పడటం మూలంగానే శ్రావణి ఒత్తిడిని ఎదుర్కోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు తేల్చారు.

Next Story
Share it